26.6 C
Hyderabad
Monday, August 3, 2026

కాలువలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

Must read

📰 Generate e-Paper Clip

 

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :

 

నిజామాబాద్ 5వ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నిజాంసాగర్ కాలువలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం కలకలం రేపింది. సోమవారం సాయంత్రం సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికితీశారు. మృతుడి వయస్సు సుమారు 30 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. మృతుడి ఎడమ చేతిపై చెంచమ్మ అనే పేరుతో టాటూ ఉన్నట్లు గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, మృతుడి ఆచూకీ కోసం పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మృతుడి వివరాలు తెలిసిన వారు టౌన్-5 పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.

More articles

Latest article