నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల దుర్మరణం పాలైన ఘటన నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. మాక్లూర్ కు చెందిన షేక్ పర్వాన్ (24), షేక్ ఇంతియాజ్ (22) ఆటోలో వెళ్తుండగా లారీ ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన యువకులు ఘటన స్థలంలోనే మృతి చెందారు. లారీ డ్రైవర్ ఘటన స్థలం నుంచి పరారయ్యాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ సురేష్ కుమార్ తెలిపారు.
