
కోటగిరి , బతుకమ్మ :
తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ విద్యా సంస్థలో చదువుతున్న విద్యార్థులు అదృశ్యమైన ఘటన శుక్రవారం నిజామాబాద్ జిల్లా వెలుగులోకి వచ్చింది. కోటగిరి మండల కేంద్రంలోని తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న అంబం గ్రామానికి చెందిన కౌలేడి పండరి (13) ,ఘన్ పూర్ గ్రామానికి చెందినలక్ష్మాపూర్ దీక్షిత్ (15) గురువారం రాత్రి పాఠశాల నుండి ఎవరికీ చెప్పకుండా పారిపోయారు. విద్యార్థుల కుటుంబ సభ్యులకు విచారించగా ఇంటికి రాదే రాలేదని తెలుపడంతో పాఠశాల ప్రిన్సిపాల్ అబ్దుల్ కాలీక్ ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చెసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక ఎస్సై సునీల్ తెలిపారు.