నిజామాబాద్, బతుకమ్మ : డ్రంకన్ డ్రైవ్ కేసులో పట్టుబడిన ఇద్దరికి రెండు రోజుల జైలు శిక్షా 8 మందికి జరిమానా జడ్జి విధించినట్లు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ పి ప్రసాద్ తెలిపారు. శుక్రవారం డ్రంకన్ డ్రైవ్ కేసులో పట్టుబడిన 10 మందికి కౌన్సెలింగ్ నిర్వహించినంతరం సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ నూర్ జాన్ ఎదుట హాజరు పర్చమని ఆయన పేర్కొన్నారు. ఇందులో ఇద్దరికి రెండు రోజలు జైలు శిక్ష విధించారని, మరో 8 మందికి రూ. 10,500 జరిమానాను జడ్జి విధించారని ఆయన వెల్లడించారు.