తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను టీటీడీ పట్టించుకోవడం లేదు

0 1,955

మరోసారి ఆలోచించాలని సూచన

మెదక్  ఎంపీ రఘునందన్ రావు

వెబ్ న్యూస్, బతుకమ్మ : తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను తిరుమలలో పట్టించుకోవడం లేదని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు.  శుక్రవారం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆయన మాట్లాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 294 మంది ఎమ్మెల్యేల సిఫార్సు లేఖలకు టీటీడీ అనుమతి ఇచ్చేదని గుర్తు చేశారు. కాగా, ప్రస్తుతం  ఏపీ ప్రజాప్రతినిధుల సిఫార్సులను మాత్రమే టీటీడీ పరిగణలోకి తీసుకుంటుందన్నారు. ఇది చాలా బాధకరమైన విషయమన్నారు.  ఈఅంశంపై టీటీడీ మరోసారి ఆలోచించాలని ఆయన సూచించారు.

Leave A Reply

Your email address will not be published.