బతుకమ్మ,ముప్కాల్: ముప్కల్ మండల కేంద్రంలోఎంపీడీవో గా విధులు నిర్వర్తిస్తూ కొద్దీ రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడి మృతి చెందిన ఎంపీడీవో మహమ్మద్ ముజాఫరోద్దీన్ కు గురువారం సిబ్బంది నివాళులు అర్పించడం జరిగింది. ‘ముప్కాల్ గ్రామపరిరక్షణ సమితి’ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన ఆత్మకు శాంతి కలగాలని కొన్ని నిమిషాలు మౌనం పాటించారు. కార్యక్రమంలో ఎంపీడీవో కార్యాలయం సిబ్బంది ఇతర ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.
