24 C
Hyderabad
Sunday, August 2, 2026

తెలంగాణ విద్యుత్ ఉద్యమకారులకు సన్మానం

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : తెలంగాణ ఉద్యమంలో విద్యుత్ శాఖ తెలంగాణ  కోఆర్డినేటర్ గా వ్యవహరించి ఉద్యమాన్ని ఉగ్రరూపం దాల్పించిన కె.రఘు ను ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి రాష్ట్ర సాంకేతిక సభ్యునిగా నియమించింది. ఆయనను నిజాంబాద్ జిల్లా ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ జేఏసీ  కలిసి  శుభాకాంక్షలు తెలిపి శాలువాతో పుష్ప గుచ్చం తో సన్మానించారు.

  • డైరెక్టర్ ట్రాన్స్మిషన్ సంపత్ రావుకి సన్మానం..

ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న విద్యుత్ లో డైరెక్టర్ల నియామకం చేపట్టింది. అందులో భాగంగా ట్రాన్స్కో డైరెక్టర్ ట్రాన్స్మిషన్ గా నియమించిన రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ గాదె సంపత్ రావు డైరెక్టర్ గా బాధ్యతలు చేపట్టారు. ఆయనను నిజాంబాద్ జిల్లా ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ జేఏసీ కో కన్వీనర్, టిపిడిఏ రాష్ట్ర ఆర్గనైన్ సెక్రెటరీ తోట రాజశేఖర్,  నాయిని నర్సింలు, డిప్యూటీ జనరల్ సెక్రెటరీ టిపిడిఏ శుభాకాంక్షలు తెలిపి శాలువాతో పుష్పగుచ్చంతో సన్మానించారు.

Tribute to Telangana electricity activists

More articles

Latest article