26.3 C
Hyderabad
Monday, August 3, 2026

రాజేశ్ కు ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నివాళి

Must read

📰 Generate e-Paper Clip

ఆర్మూర్, బతుకమ్మ : పట్టణానికి చెందిన మాజీ రిపోర్టర్ రాజేశ్ లాల్ ఇటీవల గుండెపోటుతో మృతి చెందగా నవనాథపురం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో శనివారం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రెస్ క్లబ్ సభ్యులు రెండు నిమిషాలపాటు మౌనం పాటించి బాధిత కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. కార్యక్రమంలో నవనాథపురం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు మంచిర్యాల నరేందర్, జిల్లా ఉపాధ్యక్షుడు సంజీవ్(పార్దెం), ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ ముద్ర కొల, ప్రధాన కార్యదర్శి మహేశ్, కోశాధికారి మహిపాల్, మాజీ అధ్యక్షుడు గంగమోహన్, గటాడి అరుణ్, బారడ్ గణేశ్, సత్ పుతే శ్రీనివాస్, విన్సెంట్, మరియాల వెంకటేశ్, అరుణ్గంధం చిరంజీవి, ఎశ్వని నితీశ్ తదితరులు పాల్గొన్నారు.

 

More articles

Latest article