నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : జూన్ 30న ఉద్యోగ విరమణ చేసిన నిజామాబాద్ జిల్లా పిఆర్టియు తెలంగాణ అధ్యక్షులు, బర్కత్పుర జియుపిఎస్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు సోడి కృపాల్ సింగ్ ను గురువారం జియుపిఎస్ పూలాంగ్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రభాకర్, ఉపాధ్యాయ బృందం ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి నిజామాబాద్ సౌత్ మండలానికి చెందిన మండల విద్యాధికారి సాయ రెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కృపాల్ సింగ్ విద్యార్థులకు అందించిన సేవలను గుర్తు చేశారు. ఉపాధ్యాయ సంఘం నేతగా ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించడంలో చురుకైన పాత్ర పోషించారని ప్రశంసించారు. ఆయన శేష జీవితం సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.
