నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఎంపీడీసీఎల్ సిఎండి కే వరుణ్ రెడ్డి కంపెనీలో ఉద్యోగస్తులకు అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారికి ర్యాంకులు 2022 ఏప్రిల్ నుండి ప్రకటించారు. అందులో భాగంగా అక్టోబర్ నెలకి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పరిధిలో బోధన్ డివిజన్, రుద్రూర్ సబ్ డివిజన్ కు ప్రథమ స్థానం లభించింది. సాంకేతిక, రెవిన్యూ అంశాలపై సబ్ డివిజన్ ఏఇ లు, స్టాప్ పై సమీక్ష నిర్వహించారు. ఇందులో ఏడిఈ తోట రాజశేఖర్ ను, శివాజీ గణేశ్ అకౌంట్స్ ఆఫీసర్ బోధన్, రుద్రూర్ గిరిధర్ కోటగిరి బుజ్జి బాబు పొతంగల్ ఫక్రుద్దీన్ వర్ని బాలకిషన్ చందూర్ గోపి, సుమితారాణి, నవీన్ ఏ ఈ ,సబ్ ఇంజనీర్ లను సన్మానించారు. సమావేశంలో అందరితో డ్రగ్స్ రహిత సమాజం నిర్మాణం కోసం, డ్యూటీలో మద్యం సేవించం అని ప్రతిజ్ఞ చేయించారు.


