25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

తాళం వేసిన ఇంటిని దోచేసిన దొంగలు

Must read

📰 Generate e-Paper Clip

. . . 4 తులాల బంగారం,రూ.1.80 లక్షల నగదు అపహరణ

బతుకమ్మ, ఆర్మూర్ :

అర్మూర్ లో తాళం వేసిన ఇంటిని దొంగలు దోచేశారు. రెండు రోజుల క్రితం జరిగిన దొంగతనం గురువారం అలస్యంగా వెలుగు చూసింది. ఆర్మూర్ పట్టణంలోని తిరుమల కాలనీలో ఆర్మూర్ లోని డిటిడిసి నిర్వహిస్తున్న మహేష్ తల్లి ఆరోగ్యం బాగా లేకపోవడంతో చికిత్స నిమిత్తం ఇంటికి తాళం వేసి మంగళవారం ఉదయం హైదరాబాద్ వెళ్లాడు. బుధవారం రాత్రి తిరిగి వచ్చేసరికి ఇంటి తాళాలు పగలగొట్టి అగంగతకులు బీరువాలోని 4 తులాల బంగారం,రూ.1. 80 లక్షలను ఎత్తుకెళ్లారు. కొరియర్ కి సంబంధించిన రూ.లక్ష 80 వేలు బ్యాంకులో వేయాల్సి ఉండగా అత్యవసరంగా హైదరాబాద్ వెళ్లడంతో ఇంట్లో ఉంచి వెళ్లాడు. కాని దోంగలు  దోచేశారు. బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని సంఘటన స్థలాన్ని ఆర్మూర్  పోలీసులు ,క్లూస్ టీం సిబ్బంది పరిశీలించారు.

 

More articles

Latest article