బతుకమ్మబోధన్: నిజామాబాద్ జిల్లా సాలూర మండలం హున్సా ప్రభుత్వ పాఠశాలలో గురువారం రాత్రి గుర్తు తెలియని దుండగులు పాఠశాలలో రికార్డు రూమ్ తలుపులు పగలగొట్టి దొంగతనానికి పాల్పడ్డారు. బీరువాలు పగలగొట్టే ప్రయత్నం చేసిన అవి తెరుచుకోలేదు. పాఠశాలలో ఏమేమి దొంగిలించబడ్డాయో తెలియాల్సి ఉంది. ఈ ఘటనతో పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామస్తులు బోధన్ రూరల్ పోలీస్ స్టేషన్ లొ ఫిర్యాదు చేయనున్నారు.


