ఇందల్వాయి, బతుకమ్మ : ఇందల్వాయి మండల పరిధిలోని ఇందల్వాయి గ్రామ శివారులోని ఇట్టేడి బాల్ రెడ్డి, మిట్టపల్లి కిషన్ పొలంలో గల 16 కేయూఏ ట్రాన్స్ఫార్మర్ ల నుండి గుర్తు తెలియని వ్యక్తులు అందులోని ఆయిల్,రాగి తీగలను దొంగలిచారు. ఇందల్వాయి మండల విద్యుత్ శాఖ ఏఈ పండరీనాథ్ ఇందల్వాయి పోలీస్ స్టేషన్ లోని ఎస్సై జి సందీప్ కు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించడం జరిగిందని ఎస్సై జి సందీప్ తెలిపారు. రైతులు బాల్ రెడ్డి, మిట్టపల్లి కిషన్ కుటుంబ సభ్యులు మాట్లాడుతూ ట్రాన్స్ఫార్మర్ల నుండి ఆయిల్, రాగి వైర్లు,దొంగిలించిన వ్యక్తులను తొందర్లోనే పట్టుకొని తమకు న్యాయం చేయాలని కోరారు.
