నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ రూరల్ మండంలం మల్లారం గొల్లగుట్టతండా జగదాంబ సేవాలాల్ ఆలయంలో ఆదివారం రాత్రి చోరీ జరిగింది. గుర్తు తెలియని దుండగులు ఆలయ తాళాలు పగులగొట్టి 4మాసాల అమ్మవారి బంగారు ముక్కు పుడుక, తులం బంగారం గొలుసు ఎత్తుకెళ్లారు. ఆలయ నిర్వహకుల ఫిర్యాదు మేరకు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.