జుక్కల్, బతుకమ్మ :
బిచ్కుంద మండలంలొని హస్గుల్ క్వారీ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తున్న మూడు ట్రాక్టర్ లను జుక్కల్ తహసీల్ధార్ హిమ బింధు సిజ్ చేశారు. మహ్మద్ గ్రామం మీదుగా జుక్కల్ కు తరలిస్తుండుగా తహసీల్ధార్, సిబ్బంది మూడు ట్రాక్టర్ లను పట్టుకుని ఎమ్మార్వో కార్యాలయంకు తరలించారు. బిచ్కుంధ మండలంలోని మంజీరా నది పరివాహక ప్రాంతంలో ఇసుకను తవ్వి మహ్మదబాద్, కేమ్రాజ్ కల్లాలీ మీదుగా ఇసుకను తరలిస్తుంటే బిచ్కుంధ పోలీసులు, రెవిన్యూ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించడంపై విమర్శలు వస్తున్నాయి..
