27.5 C
Hyderabad
Friday, July 31, 2026

మద్యం మత్తులో తండ్రిని చంపిన తనయుడు

Must read

📰 Generate e-Paper Clip

బాన్సువాడ , బతుకమ్మ                                                                                                                                                  

మద్యం మత్తులో కొడుకు తండ్రి తలపై కర్రతో కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలంలో దీపావళి పండుగ రాత్రి గురువారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం నెమ్లి గ్రామంలో హన్మాండ్లు అనే వ్యక్తి మద్యం మత్తులో గురువారం రాత్రి తండ్రి సాయిబోయి (55)తో డబ్బుల విషయమై గొడవపడ్డాడు. ఆవేశంలో కొడుకు తండ్రి తలపై కర్రతో బాదడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. కొడుకు ఘటన స్థలం నుంచి పరారయ్యాడు. నస్రుల్లాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. 

 

 

More articles

Latest article