అయోధ్య, బతుకమ్మ : అయోధ్యలో సరయూ నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వరద ప్రవాహం ప్రమాదకర స్థాయికి చేరడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. సరయూ ఘాట్ లో అధికారులు హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు. ప్రమాదస్థాయి నీటిమట్టం 92.73 మీటర్లు కాగా.. ప్రస్తుతం 91.92 మీటర్లకు నీటి మట్టం చేరింది.
