- ప్రజావాణిలో బిఎస్పి జిల్లా అధ్యక్షుడు ఫిర్యాదు
కామారెడ్డి సిటీ, బతుకమ్మ: బంజేపల్లి గ్రామంలోని మోటర్ పడ్డ లోది తాండ, సిక్కులోని లొద్ది తాండ, కొత్తగూడెం తాండ రోడ్డు మంజూరై ఆరు నెలల కాలం గడుస్తున్న ఇప్పటికీ పన్నులు ప్రారంభించలేదని బిఎస్పి కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు హర్యానా నాయక్ సోమవారం ప్రజావాణిలో కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. వారు మాట్లాడుతూ.. నిత్యవసరాలకు హాస్పిటల్ల, వ్యవసాయదారులు ప్రధానంగా ఉపయోగించే దారి వాహనాల సంగతి అయితే దేవుడు ఎరుగు కనీసం మనుషులు నడవలేని పరిస్థితి ఉంది అని అన్నారు. తాండ ప్రజలకు బ్రిడ్జ్ కూడా ఎంత అవసరమని అధికారులు స్పందించి త్వరగా రోడ్డు పనులు ప్రారంభించి నిర్మించాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వన్ కు కోరినట్లు వారు తెలిపారు.
