మోర్తాడ్, బతుకమ్మ: శ్రావణమాసం సందర్భంగా మోర్తాడ్ మండలంలోని శెట్పల్లి గ్రామంలో గల శ్రీ బుగ్గ రామ లింగేశ్వరా స్వామినీ సోమవారం కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి సందర్శించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రాచీన కాలంలో గిరిజనంద స్వామి చేత ప్రతిష్టించడం జరిగిందని ఆలయ విశిష్టతను ఆయనకు వివరించారు. కార్యక్రమం లో ఆడిపు గంగ ప్రసాద్, కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి గిర్మాజీ గోపి, గురిజాల నర్సారెడ్డి, లక్మ రంజిత్, మనోజ్, దేవేందర్, కుకునూరు భూమ రెడ్డి గంగనర్సయ్య, బిల్లాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
