బాన్సువాడ, బతుకమ్మ :
కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవం సందర్భంగా కామారెడ్డి జిల్లా ఉత్తమ ప్రిన్సిపాల్ అవార్డును జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర, రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ విక్టర్, లోకల్ బాడీ అదనపు కలెక్టర్ మధుమోహన్ చేతుల మీదుగా బాన్సువాడ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ అసద్ ఫారూఖ్ అందుకున్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ అసద్ మాట్లాడుతూ జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ అధికారి షేక్ సలాంకు, కళాశాల బృందానికి , అధికారులకు ధన్యవాదాలు తెలియజేశారు.
