. పీసీసీ చీఫ్ నిర్ణయం తీసుకుంటారు
. మాజీ ఎంపీ వీ హనుమంతరావు
హైదరాబాద్, బతుకమ్మ: ఓసీలపై మాట్లాడడంతోపాటు బీసీలకు న్యాయం చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం లేదని వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సంగతి పార్టీ డిసిప్లినరీ కమిటీ యాక్షన్ తీసుకుంటుందని, పీసీసీ చీఫ్ నిర్ణయం తీసుకుంటారని మాజీ ఎంపీ వి హనుమంతు రావు అన్నారు. దేశంలో కుల గణన చేసిన వ్యక్తి సీఎం రేవంత్ రెడ్డి ఒక్కడేనని, ఇది యావత్ భారతదేశానికి దిశానిర్దేశం చేసిందన్నారు. ఎస్సీ వర్గీకరణపై సైతం సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా ఉన్నారన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ కు నిధులు కేటాయించిన విధంగానే బీసీ సబ్ ప్లాన్ కు రూ.25వేల కోట్ల బడ్జెట్ కేటాయించాలని సీఎంను కోరారు. స్వాతంత్ర్యం వచ్చిన 76 ఏళ్లకు బీసీలకు న్యాయం జరుగుతోందని, సీఎం కు ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు.
