- నగర మేయర్ దండు నీతూ కిరణ్
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : మున్సిపల్ అధికారుల, సిబ్బంది సహకారం మరువలేనిదని నగర మేయర్ దండు నీతూ కిరణ్ అన్నారు. మున్సిపల్ కార్యాలయంలోని మేయర్ ఛాంబర్ లో ఆదివారం పదవి కాలంలో తనకు సహకరించిన అధికారులకు, సిబ్బందిని సన్మానించారు.

కమిషనర్ దిలీప్ కుమార్, అసిస్టెంట్ కమిషనర్ శంకర్, డిప్యూటీ కమిషనర్ రాజేంద్ర కుమార్, మున్సిపల్ ఇంజనీర్ మురళి, డీసీపీ శ్యామ్ కుమార్, మేనేజర్ జనార్దన్, డి.ఇలకు, ఎ.ఇలకు శానిటేషన్ సూపెరవైజర్లకు, మెప్మా సిబ్బందికి శాలువాతో సత్కరించి ధన్యవాదాలు తెలిపారు.

