శివాజీ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న కార్పొరేషన్ చైర్మన్
బాన్సువాడ, బతుకమ్మ : పట్టణంలోని గౌలిగూడ చౌరస్తాలో బుధవారం శివాజీ జయంతిని పురస్కరించుకొని రాష్ట్ర అగ్రో కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజ్ ఆయన విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు ఖలేక్, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి, నాయకులు జంగం గంగాధర్, నార్ల రవీందర్ , ఎజాస్, ప్రదీప్ పటేల్, బోడ భాస్కర్, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.