తెలంగాణ అభివృద్ధి అయింది కానీ ప్రజలు కాలేదు

0 1,267
  •  రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఉపాధ్యక్షులు ఆచార్య ఇ. పురుషోత్తం

 

నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : తెలంగాణ అభివృద్ధి అయింది కానీ ప్రజలు అభివృద్ధి కాలేదని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఉపాధ్యక్షులు ఆచార్య ఇ. పురుషోత్తం అన్నారు.  తెలంగాణ విశ్వవిద్యాలయంలో డిపార్ట్మెంట్ ఆఫ్ అప్లైడ్  ఎకనామిక్స్ విభాగాధిపతి డాక్టర్ ఏ పున్నయ్య  అధ్యక్షతన  తెలంగాణ రాష్ట్ర బడ్జెట్  2025-26 విశ్లేషణ  అనే అంశంపై శుక్రవారం సెమినార్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి విద్యారంగం మీద  మనస్సు కేంద్రీకరించినారని  విద్యకు గతంలో ఎన్నడు లేని విధంగా రూ. 23,108 కోట్లు కేటాయించిందని ఇది గతం కంటే  రూ. 1816 కోట్లు అధికమన్నారు. ఉన్నత విద్యారంగాన్ని  అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోవడానికి అభివృద్ధి పద్ధతి కింద  రూ. 500 కోట్లు కేటాయించడంతో  ఉన్నత విద్యా రంగంలో  బోధనా పరిశోధన వసతులు  మెరుగయితాయని పేర్కొన్నారు. విద్యారంగ అభివృద్ధికి  58 ఇంటిగ్రేటెడ్ పాఠశాలలను  అన్ని వసతులతో ఏర్పాటు చేయడానికి ప్రభుత్వ నడుంబిగించిందని పేర్కొన్నారు. విశ్వవిద్యాలయాలను  బలోపేతం చేయాలని  సంకల్పంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  విశ్వవిద్యాలయాల ఆచార్యుల  పదవీ విరమణ వయసు  65 సంవత్సరాలకు పెంచినారని పేర్కొన్నారు.  ఉన్నత విద్యారంగంలో  పాఠ్యప్రణాళికలో   మార్పులకు ఉన్నత విద్యా మండలి నడుం బిగించిందని పేర్కొన్నారు. రాబోయే విద్యా సంవత్సరం ప్రతి కోర్స్ కు  ఇంటర్న్ షిప్ ప్రవేశపెట్టనున్నామని  తెలిపారు. త్వరలో విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న  పోస్టులను భర్తీ చేస్తామని  హామీ ఇచ్చినారు. అకాడమిక్ కన్సల్టెంటా  సర్వీసును క్రమబద్ధీకరించడానికి ఉన్నత విద్యా మండలి కృషి చేస్తుందని పేర్కొన్నారు. అవుట్సోర్సింగ్ కాంట్రాక్టు  ఉద్యోగుల సమస్యలను సమీక్షించి  ప్రభుత్వానికి నివేదించనున్నట్లు పేర్కొన్నారు.  వైస్ ఛాన్స్లర్  ఆచార్య టి యాదగిరిరావు మాట్లాడుతూ  2025 -26 సంవత్సరానికి గాను ఈ ప్రభుత్వం  రూ. 3,04,965 కోట్లు బడ్జెట్ ను ప్రవేశపెట్టిందన్నారు. ఈ కేటాయింపులు విధ్వంసం నుంచి వికసిత భారత్ లక్ష్యంగా  రాష్ట్ర పురోగతి ఉంటుందని పేర్కొన్నారు.  రిజిస్ట్రార్ ఆచార్య ఎం. యాదగిరి మాట్లాడుతూ సమగ్ర మరియు స్థిరమైన అభివృద్ధికి ఈ బడ్జెట్ ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. రెవెన్యూ ఎక్స్పెండిచర్ కంటే  క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అధికంగా ఉన్నప్పుడే  రాష్ట్రం పురోగతి దిశగా అడుగులు వేస్తుందని పేర్కొన్నారు.  ఎస్ బి ఐ, డీజీఎం  బిజయ్ సాహు  మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ  పొదుపు ప్రవృత్తిని పెంచుకోవాలని,జీవిత బీమా మరియు డిపాజిట్లు పెంచుకోని ఆర్థిక వ్యవస్థ అభివృద్ధిలో  భాగం పంచుకోవాలన్నారు.  ప్రిన్సిపల్ డాక్టర్ ప్రవీణ్ మామిడాల మాట్లాడుతూ  తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ కూర్పులో  తెలంగాణ విశ్వవిద్యాలయంలోని  విద్యార్థుల భాగస్వామ్యం ఉండే విధంగా  విద్యార్థులు ఎదగాలని ఆకాంక్షించారు.  ఈ సెమినార్ లో    చైర్మన్ బి ఓ ఎస్  డా.టి సంపత్  ప్రొఫెసర్ రవీందర్ రెడ్డి, డా.నాగరాజు పాత, డాక్టర్ ఎన్ స్వప్న, డా. సిహెచ్  శ్రీనివాస్, డా. దత్త హరి పాల్గొన్నారు.

Telangana has developed but the people have not.

Leave A Reply

Your email address will not be published.