నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ గిరిరాజ్ ప్రభుత్వ కళాశాలలోని ఉద్యోగ,ఉపాధ్యాయ, విద్యార్థులు బుధవారం నల్ల బ్యాడ్జి ధరించి నిరసన వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బీ.ఆర్. గవాయిపై షూ విసిరిన న్యాయ వాది రాకేశ్ కిశోర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇలాంటి దాడులను దేశవ్యాప్తంగా, ప్రజాస్వామ్యవాదులు ఖండించాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ రామ్ మోహన్ రెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్.రంగరత్నం, పి.ఆర్వో.దండు స్వామి, భరత్ రాజ్, రాజేష్, నహేదబేగం, రంజిత, వినయ్ కుమార్, రామస్వామి, రాహుల్, రామకృష్ణ, బాలామణి, వెంకటేష్ గౌడ్, ఏ.వో. రామ్ కిషన్, సూపరిండెంట్ ఉదయభాస్కర్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు
