బాన్సువాడ, బతుకమ్మ:
కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మండలం కొత్త బాది ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో హిందీ టీచర్ గా విధులు నిర్వహిస్తున్న ప్రమీల ఉపాధ్యాయురాలు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన గురువారం చోటుచేసుకుంది. గత కొన్నేళ్లుగా క్యాన్సర్ తో బాధపడుతున్న ప్రమీల తన జీవితంపై విరక్తి చెంది ఇంకా తనకు క్యాన్సర్ నయం కాదని తనకు చావే కారణమని భావించి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. భర్త రవీంద్ర నాయక్ నాగిరెడ్డిపేట్ మండలం ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారు. సంఘటన స్థలానికి బాన్సువాడ సిఐ సత్యనారాయణ గౌడ్ చేరుకొని ఉపాధ్యాయురాలు ప్రమీల ఆత్మహత్యకు గల కారణాలను ఆరా తీస్తున్నారు. ప్రమీల స్వస్థలం బోధన్ .
