బోధన్, బతుకమ్మ : బోధన్ పట్టణం లయన్స్ క్లబ్ కాన్ఫరెన్స్ హాల్లో పదవ తరగతి, ఇంటర్మీడియట్ లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి చేతుల మీదుగా ప్రతిభ పురస్కారాలు అందజేశారు… బోధన్ ప్రయివేటు విద్యాసంస్థలు అసోసియేషన్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. బోధన్ లయన్స్ జనరల్ ఆస్పత్రికి ఎమ్మెల్యే భూమిపూజ చేశారు. బోధన్ డివిజన్ ప్రాంత ప్రజలకు 100 రూపాయల ఫీజ్ తో అన్ని ఆరోగ్య సమస్యలు నయంఅవుతాయిని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రాస్మా జిల్లా అధ్యక్షులు కొడాలి కిషోర్,శ్రీనివాస్,సూర్య ప్రకాష్,హరికృష్ణ,దిగంబర్ ,లయన్స్ లక్ష్మీ మెడం, భశ్వేశ్వర్ రావు, నాగేశ్వర రావు,నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

