కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్
అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులకు లేఖ
వెబ్ న్యూస్, బతుకమ్మ : నకిలీ, నాసిరకం ఎరువుల విక్రేతలపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను కోరారు. ఈ మేరకు ఆయన అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులకు లేఖ రాశారు. రైతులకు సరసమైన ధరలకు నాణ్యమైన ఎరువులను అందించడం చాలా అవసరమని సూచించారు.
