బతుకమ్మ,మోర్తాడ్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 16 తేదీ నుండి రైతు భరోసా నిధుల పంపిణి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని మోర్తాడు వ్యవసాయాధికారి హరీష్ కుమార్ తెలిపారు. కార్యక్రమంలో భాగంగా గురువారం నుండి మోర్తాడ్ మండలంలోని వివిధ గ్రామాలలో సాగుకు యోగ్యం కానీ భూముల సర్వే చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. కావున గ్రామంలోని రైతులందరు 16వ తేదీన డొంక ల్, పాలెం, వడ్యాట్, మోర్తాడ్, 17 దర్మోరా, దొంపాల్, షేట్ పల్లీ, 18వ తేదీన తిమ్మాపూర్, సుంకేట్ గ్రామాల్లో రైతులు అందరు తేదీలలో అందుబాటులో ఉండి సర్వే పూర్తి చేయడం లో ఆదికారులకి సహకరించగలని కోరారు.
