మోర్తాడ్, బతుకమ్మ : మోర్తాడ్ మండలంలోని సుంకేట్ గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుకున్న బండి అనుశ్రీ, నిహారిక శ్రీహిత ముగ్గురు విద్యార్థులు బాసర టెంపుల్ త్రిబుల్ ఐటీ కి ఎంపికైనట్లు పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుడు సంతోష్ కుమార్ తెలిపారు. దీంతో గ్రామంలో విద్యార్థుల తల్లిదండ్రులు మిఠాయిలు పంచి సంతోషం వ్యక్తం చేశారు.

