బతుకమ్మ ,మెండోరా: జీవితంపై విరక్తి చెంది చంద్రగిరి వెంకటేష్ (39) తన ఇంట్లోని బెడ్ రూమ్ లో గల సీలింగ్ ఫ్యాన్ కు ఉరేసుకొని చనిపోయినట్లు మెండోరా ఎస్సై నారాయణ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం మెండోరా మండలం వెల్క టూర్ గ్రామానికి చెందిన చంద్రగిరి వెంకటేష్(39) అనే వ్యక్తిబతుకు దెరువు కోసం దుబాయ్ దేశం వెళ్లాడు. ఇలా మూడుసార్లు వెళ్లినప్పటికీ పని సక్రమంగా దొరకక ఆర్థికంగా నష్టపోయాడు. భార్య శ్రావణి పిల్లలతో ఆదివారం తన తల్లి ఇంటికి వెళ్లింది. ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకుని చనిపోయినట్లు తెలియజేశారు. అతని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
