బతుకమ్మ భిక్కనూరు: భిక్కనూరు మండలంలోని సిద్దరామేశ్వర నగర్ గ్రామంలో ఉన్న గురుకుల పాఠశాల, మండలంలోని బస్వాపూర్ లోని జడ్పీహెచ్ఎస్, ప్రైమరి పాఠశాలను తెలంగాణ విద్యా కమిషన్ సభ్యులు జోత్స్నా రెడ్డి తనిఖీ చేశారు. ఈ సందర్బంగా విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేశారు. మెస్ చుట్టుపక్కల చెత్తాచెదారం లేకుండా శుభ్రంగా ఉండేలా చూడాలన్నారు. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలన్నారు.

