వర్ని మండలం కోటయ్య క్యాంపస్ లోని ఎస్సీ సంక్షేమ హాస్టల్ లో ఘటన
అస్వస్థత గురైన 23 మంది విద్యార్థులు
నిజామాబాద్, బతుకమ్మ : జిల్లాలోని వర్నిమండలం కోటయ్య క్యాంపస్ లోని ఎస్సీ సంక్షేమ హాస్టల్ లో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ జరిగింది. హాస్టల్ పప్పు అన్నం తిన్న విద్యార్థులు 11గంటలకు వాంతులు చేసుకుని అస్వస్థతకు గురయ్యారు. వెంటనే 23 మంది విద్యార్థులను చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
