ఇందల్వాయి,బతుకమ్మ : రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయతీ వర్కర్స్ సమస్యల పరిష్కారం కోసం నిర్వహించ తలపెట్టిన చలో హైదరాబాద్ కార్యక్రమానికి వెళ్లకుండా సిఐటియు నాయకులను కార్మికులను ఉదయం అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. సిఐటియు నాయకులు మాదరి గంగారం మాట్లాడుతూ తమ సమస్యల సాధన కొరకై తమ బాధలు రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించడానికి వెళ్లకుండా పోలీసులు అరెస్టు చేయడం తగదని, అక్రమ అరెస్టులతో ప్రజాపోరాటాలను ఆపలేరన్నారు.అరెస్ట్ అయిన వారిలో మండల అధ్యక్షులు మాదరి గంగారం, కార్మికులు తదితరులున్నారు.
