28.8 C
Hyderabad
Monday, August 3, 2026

వ్యూహాత్మక సమాచారం పాక్ కు చేరవేత

Must read

📰 Generate e-Paper Clip

డీఆర్డీవో కాంట్రాక్టు సిబ్బంది అరెస్టు

వెబ్ న్యూస్, బతుకమ్మ : పాకిస్తాన్ గూఢచార సంస్థ ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ కోసం గూఢచర్యం చేస్తున్నాడని ఆరోపణలపై  రాజస్థాన్‌లోని జైసల్మేర్ జిల్లాలో ఉన్న డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్  గెస్ట్ హౌస్‌లో కాంట్రాక్ట్ మేనేజర్‌గా పనిచేస్తున్న మహేంద్ర ప్రసాద్ (32) అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.  నిందితుడిని ఉత్తరాఖండ్‌లోని అల్మోరా నివాసిగా పోలీసులు గుర్తించారు. సోషల్ మీడియా ద్వారా పాకిస్తానీ ఇంటెలిజెన్స్ ఏజెంట్లకు కీలకమైన, వ్యూహాత్మక సమాచారాన్ని పంపాడు. మహేంద్ర ప్రసాద్ డీఆర్డీవో శాస్త్రవేత్తలు, భారత సైన్యం అధికారులు చందన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్‌ను సందర్శించినప్పుడు వారి కదలికలు, మిస్సైల్, ఇతర ఆయుధాల పరీక్షలకు సంబంధించిన వివరాలను పాకిస్తాన్‌కు చేరవేసినట్లు పోలీసులు గుర్తించారు.  కొన్ని వారాల పాటు నిఘా పెట్టిన తర్వాత అతడిని అరెస్ట్ చేశారు. అతడి మొబైల్ ఫోన్‌ను పరిశీలించగా, పాక్ హ్యాండ్లర్‌లతో అతడు చాట్ చేసిన ఆధారాలు లభ్యమయ్యాయి. అధికారిక రహస్యాల చట్టం, 1923 కింద అతడిపై కేసు నమోదు చేశారు. అతడిని బుధవారం కోర్టులో హాజరుపర్చనున్నారు. ఈ అరెస్ట్ భారత రక్షణ సంస్థలలో భద్రతాపరమైన లోపాలను మరోసారి వెలుగులోకి తెచ్చింది.

More articles

Latest article