బతుకమ్మ భిక్కనూరు: భిక్కనూరు పి హెచ్ సి ని రాష్ట్ర మదర్ అండ్ చైల్డ్ బృందం సోమవారం సందర్శించారు. గర్భిణీలు, పిల్లలు రక్తహీనతతో బాధపడకుండా అవసరమైన మెడిసిన్ ఇవ్వాలని సూచించారు. అనంతరం ఏ ఎన్ ఎం లు, ఆశా వర్కర్లకు రక్తహీనత బాధపడే వారికి ఏ విధంగా మెడిసిన్ ఇవ్వాలన్న విషయమై వారికి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి వైద్యాధికారిని డాక్టర్ ఆస్మ వినోద్ కుమార్ వెంకటరమణ వైద్య సిబ్బంది సతీష్ స్టాఫ్ నర్స్ చైతన్య మాధవి యాదమ్మ ఆశ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.

