నిజామాబాద్ సిటి, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో రెండ్రోజులుగా జరిగిన జిల్లా స్థాయి సైన్స్ ఫేర్ పోటీలను నిజామాబాద్ ఎస్ఎస్ఆర్ డిస్కవరి విద్యార్థినిలు అద్బుతమైన ప్రదర్శనలతో జిల్లా స్థాయిలో మొదటి స్థానంలో నిలిచారు. ఎస్ఎస్ఆర్ డిస్కవరి పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థినిలు జూనియర్ కేటగిరిలో

సుబియాఇరం , క్వాయిష్ శర్మ లు డయాస్టర్ మేనేజ్ మెంట్ అనే టీంలో సైన్స్ అండ్ టెక్నాలజి ఫర్ సస్టయినబుల్ ఫ్యూచర్, ఎర్త్ కేర్ ఆలారం వర్కింగ్ మోడల్ కేటగిరిలో అద్బుతమైన ప్రదర్శనతో జిల్లాలో మొదటి స్థానంలో నిలిచారు. వారిప్రదర్శనను రాష్ట్ర స్థాయి సైన్స్ ఫేర్ కు ఎంపికైంది. వారిని జిల్లా విద్యాశాఖాధికారులు ప్రశంసా పత్రాలను అందజేశారు. రాష్ట్ర స్థాయి సైన్స్ ఫేర్ కు ఎంపికన విద్యార్థినిలను విద్యా సంస్థల చైర్మన్ డా.మారయ్యగౌడ్, ప్రిన్సిపాల్ భాస్కర్ మెరిగలు అభినందించారు.

