26.2 C
Hyderabad
Monday, August 3, 2026

నేడు భీమ్ గల్ లో శ్రీనివాస కళ్యాణం, కోటిదీపోత్సవం

Must read

📰 Generate e-Paper Clip

భీమ్ గల్, బతుకమ్మ : కార్తీక మాసాన్ని పురస్కరించుకొని శ్రీరామ పీఠం, శ్రీరామ సేవా మండలి ఆధ్వర్యంలో శ్రీశ్రీనివాస కళ్యాణం, కోటిదీపోత్సవం కార్యక్రమంను నేడు నిర్వహిస్తున్నట్లు నిర్వహణ ప్రముఖ్ నంబి వాసుదేవ చార్యులు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. శుక్రవారం పట్టణంలోని ఎంపిడిఓ కార్యాలయ ఆవరణలో ఈ బృహత్తర కార్యక్రమంను సాయంత్రం 4 గంటలకు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. దీపోత్సవం కార్యక్రమం లో పాల్గొనే మహిళలకు దీపాలు, వత్తులు ఇక్కడే సమాకుర్చడం జరిగిందని, ఇట్టి దీపోత్సవంలో మహిళాలు అధిక సంఖ్యలో పాల్గొని, దీపాలను వెలిగించి జన్మ సార్థకత చేసుకోవాలని ఆయన సూచించారు.

More articles

Latest article