వెబ్ న్యూస్, బతుకమ్మ : గ్రహణ సమయంలో కూడా ఏపీలోని శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని మూసివేయరు. గ్రహణ సమయంలో భారతదేశంలోని అన్ని ఆలయాలు మూసివేస్తారు. ఈ ఆలయం దక్షిణ కైలాసంగా, రాహుకేతు క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. గ్రహణ దోష నివారణకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆదివారం మధ్యాహ్నం రాహుగ్రస్త చంద్రగ్రహణం కారణంగా తెలుగు రాష్ట్రాల్లోని తిరుమల, విజయవాడ కనకదుర్గ, శ్రీశైలం, యాదగిరిగుట్ట, కొండగట్టు, వేములవాడ, ధర్మపురి, కొమురవెళ్లి సహా ఆలయాలను మూసివేశారు.
