వెబ్ న్యూస్, బతుకమ్మ : తిరుపతి కల్తీ నెయ్యి కేసులో సిట్ త్వరలో చార్జిషీట్ వేయనుంది. నిందితుల బెయిల్ పిటిషన్ ను నెల్లూరు ఏసీబీ కోర్టు తిరస్కరించింది. ప్రొక్యూర్మెంట్ విభాగంలోని నాగేంద్ర, శేఖర్ ట్యాంకర్లు తనిఖీ చేయకుండా అనుమతిచ్చినట్లు సిట్ ఎదుట వాంగ్మూలం ఇచ్చారు. డబ్బులు తీసుకున్నట్లు సిట్ నిర్ధారించింది. విచారణకు సహకరిస్తామన్న ఉద్యోగుల విజ్ఞప్తితో సిట్ వారిని అరెస్ట్ చేయలేదు.
