27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

శానిటేషన్ నిర్లక్ష్యం వహించిన అధికారులకు 24 గంటల్లో షోకాజ్ నోటీసులు జారీ చేయాలి

Must read

📰 Generate e-Paper Clip

  • జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

 

కామారెడ్డి, బతుకమ్మ : పారిశుద్ధ్య కార్యక్రమాలలో నిర్లక్ష్యం వహించిన  మున్సిపల్ సిబ్బందికి మెమోలు జారీ చేయవలసిందిగా  మున్సిపల్ కమిషనర్ ను  జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆదేశించారు. శుక్రవారం కామారెడ్డి మున్సిపాలిటీలోని 15 వ వార్డులో గల వినాయక నగర్ లో అధిక వర్షాల కారణంగా దెబ్బతిన్న రోడ్ల మరమ్మతు పనులను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసినారు.  వర్షాల కారణంగా దెబ్బతిన్న రోడ్లు, డ్రైనేజీలు మొదలగు వాటిని అత్యవసరంగా పునరుద్ధరణకు ఎస్డిఆర్ఎఫ్ క్రింద మంజూరు ఇచ్చిన పనులను వెంటనే పూర్తి చేయవలసిందిగా అధికారులను ఆదేశించినారు.  శానిటేషన్ పనులు సక్రమంగా నిర్వహించని కారణంగా సీరియస్ గా పరిగణించి వెంటనే సంబంధిత ఏరియా సానిటరీ జవాన్ మరియు ఇన్స్పెక్టర్లకు 24 గంటలలో సమాధానం తెలియ జేయుటకు షో కాజ్ నోటీస్ జారీ చేయవలసిందిగా మున్సిపల్ కమిషనర్ రాజేందర్ రెడ్డి ని  ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ ఇంజనీర్ అసిస్టెంట్ ఇంజనీర్,వర్క్ ఇన్స్పెక్టర్లు, శాంటె ఇన్స్పెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

Show cause notices should be issued within 24 hours to officials who neglect sanitation

More articles

Latest article