28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

దేశ సరిహద్దు దాటుతుండగా కాల్చివేత

Must read

📰 Generate e-Paper Clip

వెబ్ న్యూస్, బతుకమ్మ: ఓ వైపు భారత్ – పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొనగా, మరోవైపు పాకిస్తానీయుడు సరిహద్దు దాటి భారత్ లోకి చొచ్చుకు వచ్చేందుకు యత్నించగా బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కాల్చి చంపారు. గురువారం రాత్రి సమయంలో పాకిస్తాన్ కు చెందిన వ్యక్తి బోర్డర్ దాటేందుకు యత్నిస్తుండగా బీఎస్ఎఫ్ దళాలు హెచ్చరించాయి.

అయినప్పటికీ సదరు వ్యక్తి వెనక్కి వెళ్లిపోకుండా సరిహద్దు దాటేందుకు యత్నించగా కాల్పులు జరిపారు. గత వారం ఓ వ్యక్తి పంజాబ్ రాష్ట్ర సరిహద్దుల్లో నుంచి ఇండియాలోకి చొరబడేందుకు యత్నించగా బీఎస్ఎఫ్ అరెస్టు చేసింది. రాజస్థాన్ సరిహద్దుల్లో నుంచి సైతం ఓ పాకిస్తానీ ఇండియాలోకి చొరబడేందుకు యత్నించి పట్టుబడ్డాడు.

More articles

Latest article