కామారెడ్డి, బతుకమ్మ :
కామారెడ్డి జిల్లా కేంద్రంలో సంత్ సేవాలాల్ మహారాజ్ గారి 287వ జయంతి వేడుకలను శనివారం అధికారికంగా ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పౌర దేవి ఎమ్మెల్సీ పీఠాధిపతి బాబు సింగ్ మహారాజ్ కి పుష్ప గుచ్చం అందజేసి ఘనంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో బిక్ష మహారాజ్, ఏఐబీఎస్ఎస్ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు రాథోడ్ సురేందర్ నాయక్, ఎల్ హెచ్పీఎస్ జిల్లా అధ్యక్షుడు గణేష్ నాయక్, ఏఐబీఎస్ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, ఏఐబీఎస్ఎస్ గాంధారి మండల అధ్యక్షుడు బొట్టు మోతీరాం, టీచర్ ప్రవీణ్ నాయక్, ఎల్లారెడ్డి నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు సర్దార్ నాయక్, లస్కర్ నాయక్, ఏఐబీఎస్ఎస్ మండల యూత్ కోశాధికారి మహేందర్ తదితరులు పాల్గొన్నారు.
