25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

భూంపల్లి ప్రాథమిక పాఠశాలలో పాఠ్య పుస్తకాలు పంపిణీ చేసిన సర్పంచ్

Must read

📰 Generate e-Paper Clip

 

కామారెడ్డి, బతుకమ్మ :

 

కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండల్ భూంపల్లి ప్రాథమిక పాఠశాలలో గ్రామ సర్పంచ్ గైని శ్రీనివాస్ ఆధ్వర్యంలో బుధవారం పాఠశాల విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలను పంపిణీ చేశారు. అనంతరం  పాఠశాలలో ప్రీ ప్రైమరీ తరగతి గదిని ప్రారంభించారు. అనంతరం విద్యార్థులకు అక్షరాభ్యాసం చేయించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు దోహదం చేసేలా ప్రభుత్వ పాఠశాలల్లో జ్ఞానమైన విద్యా బోధన అందిస్తున్నారన్నారు. గ్రామ ప్రజలు కూడా పాఠశాల అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు. ప్రైవేట్ పాఠశాలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలు కల్పిస్తున్నారని, తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ దానే రాజయ్య, పంచాయతీ కార్యదర్శి సునంద, వార్డ్ మెంబర్లు, ప్రధానోపాధ్యాయులు వీరమల్లు, మురళి, ఉపాధ్యాయులు జి.సువర్ణ, ఎస్.నవీన కుమారి, ఎం.నాగ సుష్మ, స్కూల్ చైర్మన్ నిర్మల, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

 

Sarpanch distributes textbooks at Bhumpalli Primary School.

More articles

Latest article