మెండోరా, బతుకమ్మ :
మెండోరా మండలంలో ఇసుక లారీని పట్టుకున్నట్లు ఎస్సై సువాసిని తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం శనివారం ఉదయం మెండోరా సిబ్బంది దూదిగామ్ చెక్ పోస్ట్ నందు వెహికల్ చెకింగ్ చేస్తున్నప్పుడు ఒక్క ఇసుక లారీ ఎటువంటి అనుమతులు లేకుండా మల్లాపూర్ జగిత్యాల్ జిల్లా నుండి నిర్మల్ కి తరలించడం కోసం ఇసుకను లోడ్ చేసుకొని రాగా పోలీసులు విచారించగా అట్టి ఇసుక లారీ కీ ఎలాంటి అనుమతులు లేనందున సీజ్ చేసి అట్టి టిప్పర్ డ్రైవర్ నాగరాజు, యజమాని ఈశ్వర్ ల మీద కేసు నమోదు చేసినట్లు మెండోరా ఎస్సై సుహాసిని పేర్కొన్నారు.
