నిజామాబాద్ రూరల్, బతుకమ్మ: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా శుక్రవారం బోధన్ శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి నియమితులయ్యారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డిని హైదరాబాదులోని నివాసానికి వెళ్లి నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకుల పల్లి భూపతిరెడ్డి శాలువాతో సన్మానించి , శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే వెంటా తాహెర్ బిన్ హందన్, జిల్లా డిసిసి అధ్యక్షులు, రాష్ట్ర కోపరేటివ్ కార్పొరేషన్ మానాల మోహన్ రెడ్డి ఉన్నారు.
