ఎల్లారెడ్డిపేట, బతుకమ్మ: జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కు మద్దతుగా ఎర్రగడ్డ డివిజన్ లో ప్రభుత్వ విప్, వేములవాడ శాసన సభ్యులు ఆది శ్రీనివాస్, సిరిసిల్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కె.కె మహేందర్ రెడ్డి ఆదేశాల మేరకు గడప గడప ప్రచారంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఈ సందర్భంగా వారు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించడం జరిగిందన్నారు. నవీన్ యాదవ్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మటి నరసయ్య, ఎఎంసి డైరెక్టర్ మేండే శ్రీనివాస్ యాదవ్,తాజా మాజీ సర్పంచ్ పడగల రవీందర్ గుప్తా, సోషల్ మీడియా కోఆర్డినేటర్ ఇలియాస్ బాబా నాయకులు తదితరులు పాల్గొన్నారు.
