రుద్రూర్, బతుకమ్మ :
నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నగేష్ రెడ్డిని శుక్రవారం రుద్రూర్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించారు. రుద్రూర్ మాజీ విండో చైర్మెన్ పత్తి రామును కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శిగా నియమించారు. నూతనంగా ఎన్నిక చేసినందుకు పత్తి రాము జిల్లా అధ్యక్షులు నగేష్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు తోట అరుణ్ కుమార్, మాజీ జెడ్పీటీసీ నారోజీ గంగారాం, నాయకులు సంగయ్య, అక్కపల్లి నాగేందర్ ఉన్నారు.
