నిజామాబాద్ క్రైo, బతుకమ్మ: ఆర్మ్ డ్ రిజర్వు సబ్ ఇన్స్పెక్టర్ సోలామన్ రాజు అనారోగ్యంతో మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సోలామన్ రాజును హైదరాబాద్ లోని కిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మృతి చెందారు. నిజామాబాదు నగరంలోని మూడవ టౌన్ పరిధిలో సోలామన్ రాజు స్వగృహం ఏ ఆర్ ఏ సి పి నాగయ్య, రిజర్వ్ ఇన్స్పెక్టర్ సతీష్, ఎస్సై శ్రావణ్ కుమార్, పోలీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ షకీల్ పోలీస్ సిబ్బంది పరామర్శించి ఓదార్చారు. ఈ సందర్భంగా సోలామన్ రాజు మృతదేహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు.
