25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

తక్షణ సాయంగా రూ.5వేలు అందించాలి

Must read

📰 Generate e-Paper Clip

  • జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్

Rs. 5,000 should be provided as immediate assistance

తాడ్వాయి, బతుకమ్మ : అధిక వర్షాలతో దెబ్బతిన్న ఇంటిని పరిశీలించి తక్షిణ సాయంగా ఇంటి యజమానులకు నష్టపరిహారంగా 5000 రూపాయలను అందించాలని జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ తాసిల్దార్ ను ఆదేశించారు.   శనివారం జిల్లా కలెక్టర్ తాడ్వాయి  మండల కేంద్రంలో పారిశుధ్య  పనులను పరిశీలించారు. అధిక వర్షాలతో దెబ్బతిన్న ఇండ్ల గుర్తింపు శనివారం సాయంత్రంలోగా  పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ  జిల్లాలో వరుసగా కురిసిన అధిక వర్షాలతో దెబ్బతిన్న, కూలిపోయిన ఇళ్లకు ప్రభుత్వం నష్టపరిహారం ప్రభుత్వం నష్టపరిహారం చెల్లిస్తుందని అన్నారు. మండలంలో అన్ని గ్రామాలను పరిశీలించి  దెబ్బ తిన్న ఇండ్ల వివరాలను  అందించాలని  తాసిల్దార్ ను ఆదేశించారు. వర్షాలు కురిసిన అనంతరం  వ్యాధులు ప్రబలకుండా పరిశుద్ధ కార్యక్రమాలను పగడ్బందీగా నిర్వహించాలని, నీరు నిల్వ ఉండకుండా చూడాలని, నీరు నిలువ ఉన్నచోట ఆయిల్ బాల్స్ ను వేయాలని, మిషన్ భగీరథ త్రాగునీరు సరఫరా లో ఇబ్బంది కలగకుండా చూడాలని, మండలంలో దెబ్బతిన్న పంచాయతీరాజ్ మరియు ఆర్ అండ్ బి రహదారుల వివరాలను సేకరించి మరమ్మత్తు పనులు చేయాలని, విద్యుత్ సరఫరా లో  సమస్య రాకుండా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

Rs. 5,000 should be provided as immediate assistance

More articles

Latest article